హైదరాబాద్ , బతుకమ్మ : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న యూఎస్ పీసీ ధర్నా లో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూఎస్ పీసీ మహాధర్నాకు వేలాదిమంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ల సురేశ్, ప్రధాన కార్యదర్శి పూదారి అరవింద్ జిల్లా బాధ్యులు కార్యకర్తలు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.
