వెబ్ న్యూస్, బతుకమ్మ : తండ్రికి ’బై‘ చెబుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి హర్షవర్ధన్ (4) బాలుడు మృతి చెందాడు. ఈవిషాద ఘటన సంగారెడ్డి జిల్లా పటేల్ గూడ పరిధి బీహెచ్ ఈఎల్ కాలనీలో చోటు చేసుకుంది. బాలుడి మృతి తో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
