ఇందల్వాయి, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వం అదేశాల మేరకు ఇందల్వాయి మండలంలో ప్రజా పాలన దినోెత్సవం ఘనంగా జరిగింది.
ఇందల్వాయి మండలంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం లో అనంతరావు, తహసిల్దార్ కార్యాలయంలో వెంకట్రావు, పోలీస్ స్టేషన్ లో ఎస్సై మనోజ్ కుమార్, ఐకెపి కార్యాలయంలో సువర్ణ, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో రవి మోహన్ బట్ లు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, జాతీయ పతాకావిష్కరణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రజాపాలనలో భాగంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

