బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆంజనేయులు టోల్ ప్లాజా వద్ద జరిపిన వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టగా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన చాకలి నరేందర్(34) అనే వ్యక్తికి సెకండ్ క్లాస్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష తో పాటు 200 రూపాయల శిక్ష విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భిక్కనూరు మండల పరిధిలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుని రమ్మన్నారు. హైవేల పక్కన ఉన్న ధాబాలలో మద్యం సిట్టింగులు జరప వద్దన్నారు. మద్యం సిట్టింగులు జరిపితే దాబా యాజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
