తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు జరిగాయి. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో శ్రీవాణి టికెట్పై దర్శనానికి మూడు రోజులు పట్టేది. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి ఏ రోజు టికెట్ తీసుకుంటే అదే రోజు దర్శనానికి వీలు కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈనిర్ణయంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
