హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగంతో బీజేపీ పరువుకు భంగం కలిగిందని ఆపార్టీనేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు కోర్టు విచారిస్తున్నందున ఈకేసును కొట్టి వేయాలని హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
