బోధన్, బతుకమ్మ : బుధవారం అర్థరాత్రి నుంచి ఈనెల 31 రాత్రి 11గంటల వరకు జానకంపేట్ – బోధన్ మధ్య ఉన్న రైల్వేగేట్లను మూసి వేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. దూపల్లి రైల్వే గేట్, ఎమ్మెస్సీ ఫారం, సాటాపూర్ చౌరస్తా వద్ద ఉన్న రైల్వే గేట్ల మరమతుల కారణంగా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
