నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లోని మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఈ.శ్రీనివాస్ గౌడ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్స్ టు ది తెలుగు సినిమా అనే అంశంపై ప్రో.కె. శివశంకర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి తీసిస్ ను సమర్పించడం జరిగింది, తెలంగాణ విశ్వవిద్యాలయం లో నిర్వహించిన 2 వ స్నాతకోత్సవం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పి.చ్ డి, డిగ్రీ పట్టాను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ ప్రో.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, సోషల్ సైన్స్ డీన్ ప్రో.ఘంటా చంద్ర శేఖర్, అధ్యపకులు స్కాలర్ లు పాల్గొన్నారు.
