మద్నూర్, బతుకమ్మ: కరీంనగర్ లో జరిగిన రెండవ జోనల్ సాయి పోలీస్ డ్యూటీ మీట్ లో జిల్లా స్థాయి అధికారులు 11 పథకాలు సాధించారు. అందులో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మద్నూర్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు ఉడతవార్ సురేష్ , మోర్ అశోక్ కుమార్ లు కలిసి ఆయనను ఆదివారం సన్మానించారు. ఇలాంటి పథకాలు మరెన్నో సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరారు.
