ధర్పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజవర్గం ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ళను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నాణ్యత తో కట్టుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నవారికి ఇల్లు వస్తాయని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎవరైనా డబ్బులు అడిగారా.. అడిగితే నాకు వెంటనే ఫోన్ చేయండి అని అన్నారు. లబ్ధిదారులు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సొంత ఇల్లు కల నెరవేరుతుందని అన్నారు. ఎవరు డబ్బులు అడగట్లేదు అని, ఈ ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ధర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు , లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
