హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయంగా రైతుభరోసా అందించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లా లో గల యూరియా కొరత గురించి మంత్రి దృష్టి కి తీసుకెళ్లగా సానుకూలం గా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
