28.8 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడికి నీదర్శనం వెల్గటూర్ వాస్తవ్యులు రేణిగుంట ప్రసాద్. మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మానవతావాదిగా నిలిచారని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులకు భోజన పల్లాల ను అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article