హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పని చేస్తున్న 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేంధర్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీలుగా (సివిల్ )గా పని చేస్తున్న 44 మందికి ఒకేసారి స్థానచలనం కల్పించారు. గద్వాల్ డీఎస్పీగా పని చేస్తూ హైడ్రాలో పని చేస్తున్న కె.సత్యనారాయణను నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ సీసీఆర్ బీలో ఏసీపీగా ఉన్న రవీంధర్ రెడ్డిని సైబరాబాద్ లో సైబర్ క్రైం ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.
