హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమైంది. ప్రభాకర్ రావు వ్యక్తిగత సెల్ ఫోన్లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఎస్బీకి చెందిన కీలక సమాచారాన్ని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. హార్డ్ డిస్క్ లు ధ్వంసంపై సిట్ విచారణ చేస్తోంది. బుధవారం సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది.
