- తహసిల్దార్ వెంకట్రావు
ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలంలోని ప్రేమలో ని ప్రియాంభక్పేట్ తాండ లో తాసిల్దార్ ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, మాజీ సర్పంచ్ సీతారాం, సర్వేయర్ చరణ్ రాజు, రాకేష్ రెడ్డి, వెంగాల్, బాబురావు,బాలగంగారం రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

