24 గంటల్లో ఐదుగురి మృతి
వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,026కు పెరిగిందని, గడిచిన 24 గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలలోపు ఐదుగురిని మృతి చెందారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. కానీ తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించింది. కేసుల సంఖ్య పెరుగుతన్నప్పటికీ ప్రజలు భయపడొద్దని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశాయి. దేశ్యవాప్తంగా ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి.
