కామారెడ్డి, బతుకమ్మ : ఆరు, ఏడవ తరగతి పాఠ్యాంశాలను జీవశాస్త్ర, భౌతిక శాస్త్రపరంగా విభజించాలని తెలంగాణ బయోసైన్స్ ఫోరమ్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పదవ తరగతి వరకు జీవశాస్త్ర మార్కులను వంద మార్కులకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రకమంలో ప్రతాపరెడ్డి, కృష్ణకర్, సురేష్, పంపరి ప్రవీణ్ కుమార్, హన్మంత్ రెడ్డి, కుంట రాములు, పవన్ కుమార్, సత్యనారాయణ అంభీర్ మనోహర్, శేఖర్,రాజేశ్వర్, బాపురెడ్డి,రమణ తదితరులు పాల్గొన్నారు.

