కామారెడ్డి కోర్టలో లంచం తీసుకుంటూ దొరికిన వైనం
కామారెడ్డి, బతుకమ్మ : కోర్టులోనే లంచం తీసుకుంటుండగా కోర్ట్ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ ఘటన కామారెడ్డి కోర్టులో శుక్రవారం జరిగింది. కామారెడ్డి పట్టణ కోర్టు కానిస్టేబుల్ సంజయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాగా, కోర్టులో లంచం తీసుకుంటూ దొరికిపోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
