29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సొంత ఇంటి కల నెరవేరనున్న వేళ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: సొంత ఇంటిని నిర్మించుకొని నివాసముండాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఆశ నెరవేరుతుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. అర్హులైన వారికి శుక్రవారం మోర్తాడ్ గ్రామంలోని ఇందిరమ్మ లబ్ది దారులకు ప్రొసీడింగ్ కాపీలను  ఆమె ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ సైఫుద్దీన్, మోర్తాడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల అశోక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏనుగు మోహన్, నాగభూషణ్ ,జలజ, లక్ష్మీ, లబ్ధిదారులు పాల్గొన్నారు.

More articles

Latest article