రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన యాబాజీ సాయిలు, తండ్రి పేరు సాయిలు, రాణంపల్లి గ్రామానికి చెందిన వీరేశం, తండ్రి పేరు రాజన్న అను ఇద్దరు వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డారు. వీరిద్దరిని బోధన్ కోర్టులో హాజరు పరుచగా, యాబాజీ సాయిలు అను వ్యక్తికి మూడు రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, వీరేశం అను వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని ఎస్సై పి. సాయన్న తెలిపారు.
