నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రైన్ లలో పోగొట్టుకున్న 12 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు రైల్వే ఎస్ఐ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేసి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని మొబైల్ యజమానులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.
