మోపాల్, బతుకమ్మ: రైతులు వరి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని, వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సూచించారు. మోపాల్ మండలం సిర్పూర్ లో మంగళవారం నిర్వహించిన ‘రైతుల ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకట్ రెడ్డి, శాస్త్రవేత్త సౌమ్య, వ్యవసాయశాఖాధికారులు, రైతు నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
