ఎల్లారెడ్డి, బతుకమ్మ: మండల కేంద్రానికి చెందిన దేవావత్ భాను కు ఇద్దరు కూతుళ్లు సంతానం. తన చిన్న కూతురైన దేవావత్ నిధారాణి గత నెల ఏప్రిల్ 10వ తరగతి పరీక్షలు రాసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. కాగా గత నేత 28వ తారీకు నాడు నిదారాణి, ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా నిదారాణి ఇంట్లో వాళ్లతో ఇంటి బయట ఉన్న లైట్లను ఆన్ చేస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి ఎంతసేపటికి తిరిగి ఇంట్లోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద ఆమె కోసం వెతుకుగా ఆచూకీ ఎక్కడ లభించకపోవడంతో ఆమె తల్లి దేవావత్ భాను ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా బాలిక ఆచూకీ తెలిస్తే ఎల్లారెడ్డి పోలీసులను సంప్రదించాలని కోరారు.
