నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలోని అన్ని పరికరాలు క్లుప్తంగా పరిశీలించారు. స్కూలు విద్యార్థులకు ఎస్సే రైటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ పిల్లలకు బహుమతులు అందజేశారు. రిటైర్ అయిన ఫైర్ ఆఫీసర్లను, లీడింగ్ ఫైర్ మేలు ఫైర్ మాన్లకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు ఎలా ఎక్కడ సంభవిస్తాయో తెలియదని

అన్నారు. మన ఇంట్లో కానీ, మనం కూర్చునే కారులో కానీ, మనం ఇక్కడ కూర్చున్న గాని ఎక్కడ ఉన్న కానీ అగ్నిప్రమాదం సంభవించవచ్చని అన్నారు. దానికంటే ముందు మనం ఫైల్ ప్రికాషన్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కంపల్సరీ బిగించుకోవాలన్నారు. కంపల్సరీ పాటించాలన్నారు. ఫైర్ సేఫ్టీ పాటించాలని సూచించారు. అందరూ తప్పకుండా ఫైర్ సేఫ్టీని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ టి. పరమేశ్వర్, పి.నర్సింగ్ రావ్, ఫైర్ ఆఫీసర్ ఆర్మూర్, ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ ఐఎన్డీడీఎఎల్, ఫైర్ ఆఫీసర్ విక్రమ్ పాల్గొన్నారు.

