నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఆర్ .ఆర్ చౌరస్తాలో గల గిరిరాజ్ కాంప్లెక్స్ లో ఆదివారం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ,నుడా చైర్మన్ కేశవేణు,యూనియన్ బ్యాంక్ బడా బజార్ శాఖ చీఫ్ మేనేజర్ మనీష్ కుమార్ షైనీలు కంప్యూటర్ బజార్ వారి లెనోవా ఎక్స్ క్లూజివ్ స్టోర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన,కేక్ కట్ చేసి లాప్ టాప్ కంప్యూటర్ల కొనుగోలును ప్రారంభించారు. కొత్త కొత్త ఫీచర్స్ లతో లాప్ టాప్ లను ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో లభించే విధంగా రూపొందించినట్లు లెనోవా కంపెనీ స్టేట్ హెడ్ కార్తిక్ అయ్యర్,రీజనల్ హెడ్ జస్పీత్ సింగ్ ,సంతోష్ కుమార్ సింగ్, దిలీప్ ,విష్ణు,లెనోవా షోరూం యజమాని కేతావత్ వెంకట్ రాములు వివరించారు.
