వెబ్ న్యూస్, బతుకమ్మ : ఆన్ లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి, నిషేధించేందుకు సిట్ వేయాలని నిర్ణయించినట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను సైతం సవరించుకోవాలని సీఎం అన్నారు. క్రికెట్ ఐపీఎల్ జరగుతున్న వేళ బెట్టింగ్ పై సీఎం చేసిన ప్రకటన హర్షం వ్యక్తమవుతోంది.
