బతుకమ్మ భిక్కనూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ చలో హైదరాబాద్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే ఆశా వర్కర్లను ముందస్తుగా భిక్కనూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనీస వేతనం 18 వేల ఇవ్వాలని జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఉన్నారు.
