27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  మహమ్మద్ నగర్ మండలానికి ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషితో కోటి 35 లక్షల చే సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్  మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని తునికి పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలచే కొనసాగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మండలంలోని ప్రతి గ్రామానికి సిసి రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని గడిచిన 20 రోజుల్లో కోటి రూపాయల సిసిరో నిర్మాణ పనులు పూర్తయ్యాయని మరో 35 లక్షల రూపాయల చే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మరో నాలుగు రోజుల్లో 100% పనులు పూర్తయితయని తెలిపారు.  సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు మరికొన్ని గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మురికి కాలువల సైతం నిర్మిస్తున్నామని పనులు పూర్తయితే గ్రామాలలో సమస్యలు లేకుండా దూరమవుతాయని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు కుమ్మరి రాములు,కృష్ణ తదితరులు ఉన్నారు.

More articles

Latest article