వెబ్ న్యూస్, బతుకమ్మ : జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. మార్చి 15 న ఓమహిళా భద్రతా తనిఖీలను దాటుకొని.. పిస్టోల్ తో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గమనించిన ఆలయ అధికారులు మహిళను అదుపులోకి తీసుకొని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను డిల్లీ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న జ్యోతి గుప్తాగా గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈవిషయమై భక్తులు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
