- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సి.సి రోడ్ల నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపనలు చేసి, పనులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక మండల అధ్యక్షుడు దార్సవార్ సాయిలు,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,హన్మంత్ యాదవ్,ప్రజ్ఞ కుమార్, కుశాల్, అమోల్, బాలు యాదవ్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

