మోర్తాడ్, బతుకమ్మ: గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించడం జరుగుతుందని ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శెట్ పల్లి, పాలెం ధర్మోరా సుంకెట్మోర్తాడ్ ఐదు గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీవో శ్రీధర్, ఏ పీవో శకుంతల, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్లు సాయన్న, పృథ్వీరాజ్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చంద్రమోహన్, శ్రీనివాస్, శంకర్, జాన్సన్, పంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
