ఎల్లారెడ్డి, బతుకమ్మ:ఎల్లారెడ్డి పట్టణంలోని మైనారిటీ వసతి గృహాన్ని మంగళవారం మున్సిపల్ కమిషనర్ మహేష్ సందర్శించారు.వసతి గృహంలో వంట చేసిన ఆహారాన్ని ఆయన పరిశీలించారు.విద్యార్థులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని కోరారు.ఆయన తో పాటు, ఏ ఈ వినోద్, అధికారులు పాల్గొన్నారు.
