వెబ్ న్యూస్, బతుకమ్మ: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో 8 కీలక ఫైళ్లు మాయం ఘటన చోటు చేసుకుంది. ఈవిషయమై ఉద్యోగులను ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వివరణ అడిగారు. సరైన సమాధానం చెప్పకుండా అధికారులు మౌనంగా ఉండిపోయారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంపై ఈవో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ ఆఫీస్ నుంచి ఫైళ్లను తెప్పించి కోర్టులో కౌంటర్ వేయడానికి ఈవో చర్యలు తీసుకుంటున్నారు.
