27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

క్షమాపణలు కోరిన మోడీ

Must read

📰 Generate e-Paper Clip

ఢిల్లీ, బతుకమ్మ: ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారని, అసౌకర్యానికి గురై ఉంటే క్షమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా కోరారు.  ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం నిర్వహించడం అంత ఈజీ కాదని, ఏర్పాట్లలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని పేర్కొన్నారు. చంటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు త్రివేణి సంగమానికి తరలివచ్చి అమృత స్నానాలు ఆచరించడం ఆనందం కలిగించిందన్నారు. అలాగే తమ పూజల్లో ఎక్కడైనా లోపం జరిగితే గంగా, యమున, సరస్వతి మాతలు మన్నించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article