బతుకమ్మ,కమ్మర్ పల్లి: కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ రోడ్ లో ఆదివారం అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కమ్మర్ పల్లీ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ల యజమాని, డ్రైవర్ల పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్య తప్పు అని ఆయన హెచ్చరించారు.
