వెబ్ న్యూస్, బతుకమ్మ: యాదగిరి గుట్ట దేవాలయంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో దివ్య విమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి 40 జీవనదుల జలాలు సేకరించారు. వానమాలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
స్వర్ణ విమాన గోపురం విశేషాలు..
స్వర్ణ విమానం గోపురం ఎత్తు: 50.5 అడుగులు
ఉపయోగించిన మొత్తం బంగారం: 68 కిలోలు
బంగారు విమాన గోపురం వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
తాపడం పనులు ప్రారంభించిన తేదీ: ఫిబ్రవరి18, 2025
రాగి రేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు.

