రుద్రూర్, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, రాయకూర్ గ్రామాలల్లో గల మండల పరిషత్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలిని బిజెపి నాయకులు కలిసి బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి సంఖ్య వెయ్యాలని తెలిపారు. ఈ ప్రచారంలో మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, సతీష్ పవర్, వినోద్ కుమార్, సాయికుమార్, శివ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
