27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ కు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న జరిగిన శిక్షణ  నిర్వహించగా  తోర్లికోండ జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ కే. సాయిలు, బ్రాహ్మణపల్లి జడ్ పి హెచ్ ఎస్ ఎస్ఏ ఎ. గంగాధర్, మునిపల్లి జడ్పిహెచ్ఎస్ ఎస్ఏ విజయేందర్ రెడ్డి, మోర్తాడ్ జడ్పీహెచ్ఎస్ ( గర్ల్స్) ఎస్ఏ వినోద్, జడ్పిహెచ్ఎస్ సంఘం ఎస్ఏ రామచందర్, మోస్రా జడ్పిహెచ్ఎస్ ఎఫ్ఎసీ హెచ్ ఎం  ఎం. బాలజీరావు, అంబేం ఎంపియుపిఎస్ ఎస్ఏ మనోజ్ లు గైర్హాజరు అయ్యారు.  7 గురు ఉపాద్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.

More articles

Latest article