వెబ్ డెస్క్, బతుకమ్మ : దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈవిషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నూతన ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈబిల్లును గురువారం (ఫిబ్రవరి 13న) లోకసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈబిల్లులో 536 సెక్షన్లు, 23 ఛాప్టర్లు ఉన్నాయి. కొత్త బిల్లును 622 పేజీల్లో రూపొందించారు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు: 536 సెక్షన్లు- 622 పేజీలు
