వెబ్ డెస్క్, బతుకమ్మ : స్థానిక కోటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ విద్యార్థులకు తెలంగాణలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదన్న సుప్రీం తీర్పును రాష్ర్టం ప్రభుత్వం ప్రస్తావించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేసింది.
