. ‘బతుకమ్మ’ కథనానికి స్పందన
బోధన్, బతుకమ్మ: జిల్లాలోని సాలూరాలో అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ పరిధిలోని భూమిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తున్న వైనంపై ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి అటవీశాఖ అధికారులు స్పందించారు. చెట్లు నరికిన వారికి రూ.3వేల జరిమానా విధించారు. భూమి కబ్జాపై ఇతర శాఖల అధికారులు స్పందించకపోవడం గమనార్హం. భూమి సర్వే నంబర్ ఎంత? ఎన్ని ఎకరాల విస్థీర్ణం ఉందో తెలియని పరిస్థితి ఉంది. అసలు చెట్లు నరికేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు అనేది తేలలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ వెంటనే స్పందించి భూ కబ్జాను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
