డిల్లీ, బతుకమ్మ : డిల్లీలో బీజేపీ పార్టీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో డిల్లీలో వారిని అభినందించి, సన్మానించారు. ఈవిజయాన్ని ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు. జంగ్ పుర బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియాను ఓడించడం విశేషం.

Arvind is happy about BJP’s victory in Delhi
