- మూడు లక్షల నగదు.. 10 తులాల బంగారం అగ్నికి ఆహుతి
నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పెంకుటి ఇంటిలో శుక్రవారం ఉదయం షార్ట్ సర్కిల్ తో అగ్నిప్రమాద సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయట పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో సుమలత ప్రసాద్ లకు సంబంధించిన మూడు లక్షల నగదు, 10 తులాల బంగారం, 15 తులాల వెండి, ఇంటి సామాగ్రి కాలి బూడిదయింది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించిన ఫైర్ ఇంజన్ వచ్చేసరికి పురాతన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది.

