ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. తన నియోజకవర్గ ప్రజలు గత 40 ఏళ్లుగా సరైన రవాణాసౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్ డిపో ఏర్పాటు చేయడంతోపాటు మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు.
