బతుకమ్మ,కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గుండ్లకుంట్ల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు చొరబడ్డారు. దేవాలయం తాళం పగులగొట్టి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. గుడి ఆవరణలోని రెండు గదుల్లో ఉన్న వస్తువులను దొంగలించారు. ఆలయ అర్చకురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.
