బతుకమ్మ, పిట్లం : సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ వేణుగోపాల రావు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం సీపీస్ విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ యూపీస్ అమలు చేసే స్థాయిలో గెజిట్ విడుదల చేసిందని, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందపరచిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ సీపీఎస్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు పి బన్సీలాల్, ప్రధాన కార్యదర్శి సి.నారాయణ, తెలంగాణ స్టేట్ పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాణిక్యరావు, సంతోష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్ , నగేష్, మండల ఉపాధ్యక్షురాలు అరుణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
