బతుకమ్మ, ఏర్గట్ల : ఏర్గట్ల మండలం తోర్తి గ్రామంలో గంజాయి నిర్మూలన అవగాహన కోసం గురువారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండల ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి అధ్యక్షులు సల్ల నవీన్, ఉపాధ్యక్షులు తొపారం రాజ్ కుమార్, అధ్వర్యంలో ఏర్గట్ల ఎస్సై రాము చేతుల మీదుగా అవగాహన వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివచరణ్,ఆర్ఐ సదానందం, ఉపాధ్యాయులు శంకర్, నాగార్జున్, గంగమోహన్, పెద్ద భూమేశ్వర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
