23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మిషన్ భగీరథ కార్మికుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

  • ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆందోళన

బతుకమ్మ,ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని మీషన్ భగీరథ లో పని చేస్తున్న కార్మిక కూలీలు తమకు రావాల్సిన 6 నెలల వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వడం లేదని మిషన్ భగీరథ గేటు ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ యాజమాన్యం స్పందించి ఆరు నెలల వేతనాలు తొందర్లోనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు,సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article