29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రూ.2 లక్షల ఎల్వోసీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన ఎం.దశరత్ కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోమవారం రూ.2లక్షల ఎల్ఓసీ బాల్కొండ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.  న్యూరో చికిత్స నిమిత్తం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం ఎల్ఓసీ మంజూరు చేశారు. ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ,మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,మెండోరా వైస్ ఎంపిపి రవిందర్ గౌడ్,కోడిచెర్ల గ్రామ శాఖ అధ్యకులు దేవేంధర్ రెడ్డి,మాజి ఉప సర్పంచ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article