నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ ఆవిష్కిరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, మండల విద్యాశాఖ అధికారి సీఎం సాయి రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఉత్తరం నారాయణ గౌడ్, ఇతర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, రమేష్ రెడ్డి, నరేందర్, ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
